MRI Machine: భారత శాస్త్రవేత్తల ప్రతిభ...భారత్ లో తొలి MRI మెషిన్ తయారీ 4 d ago

featured-image

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి MRI (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) మెషీన్ ను కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేసింది. దీన్ని దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఇన్ స్టాల్ చేసి అక్టోబర్ 2025 నుంచి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు MRI మిషన్లను, వీటికి సంబంధించిన విడిభాగాలను దాదాపు 80-85శాతం ఇతర దేశాల నుంచి భార‌త్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో వైద్య చికిత్సల ఖర్చులు పెరిగి ప్రజలపై భారం పడుతోంది.

అయితే, ఇప్పుడు ఈ స్వదేశీ MRI మెషిన్ తో చికిత్స ఖర్చులు తగ్గుతాయి. ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతుల పై ఆధారపడటం తగ్గుతుంది. దీనిని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయంప్రతిపత్తి సంస్థ SAMEER (సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్) అభివృద్ధి చేసింది. ఈ MRI మిషన్ ను డిసెంబర్ 2014 లో ప్రారంభమైన నేషనల్ మిషన్ SCAN-ERA కింద అభివృద్ధి చేశారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD